ఎండల దెబ్బకు తట్టుకోలేక ఎక్కువసేపు ఏసీలలో ఉంటున్నారా? జాగ్రత్త!
తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నిప్పుల కుంపటిని తలపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏసీల వాడకం బాగా పెరిగింది. విపరీతమైన ఎండల ధాటికి తట్టుకోలేక గంటలకొద్దీ ఎసి రూముల్లో కూర్చుంటున్నారు జనాలు. అయితే ఏసీ అధికంగా ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్యాలు కలుగుతాయని చెబుతున్నారు వైద్యులు.
ఎక్కువసేపు ఏసీలలో ఉంటే జరిగేదిదే
ఏసీ అధిక వినియోగం వల్ల ఆరోగ్యం పైన ఎటువంటి ప్రభావం పడుతుందో ప్రస్తుతం తెలుసుకుందాం.ఏసీని అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో తేమ తగ్గిపోతుంది. ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఒళ్ళు కాస్త దురదగా అనిపించే ప్రమాదం ఉంటుంది. ఏసీ అధిక వినియోగం వల్ల కళ్ళు పొడిబారుతాయి.

ఏసీలలో ఎక్కువ ఉంటే కళ్ళ సమస్య
కంప్యూటర్లు, ల్యాప్టాప్ల మీద ఎక్కువ సమయం వర్క్ చేసే వారికి కూడా కళ్లు పొడిబారే సమస్య వస్తుంది. ఇలాంటి వాళ్లు ఎక్కువ సేపు ఏసీ లలో ఉండడం వల్ల సమస్య మరింత తీవ్రతరమవుతుంది. కళ్ళ దురద, చిరాకు పెరుగుతాయి. ఫలితంగా కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
ఏసీలలో చర్మ ఆరోగ్యంపై ప్రభావం
ఏసీలో అధికంగా ఉండటం వల్ల చర్మంలో సహజంగా ఉండే నూనె ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో చర్మం డీహైడ్రేట్ అవుతుంది. ఏసీ నుండి వచ్చే పొడి గాలికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీల వల్ల రోసేసియా, సోరియాసిస్, తామర వంటి చర్మ సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి.
ఏసీతో అకాల వృద్ధాప్యం
ఏసీ లలో ఎక్కువగా ఉండటం వల్ల అకాల వృద్ధాప్యం వస్తుంది. చర్మం ముడతలు పడిపోతుంది. చర్మంలో ఎలాస్టిసిటీ తగ్గుతుంది. ఏసీ లలో ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. జుట్టు పొడిబారి ఎక్కువగా రాలిపోతుంది. దద్దుర్లు, అలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఏసీలలో ఉంటే ఈ సమస్యలు .. జాగ్రత్త
ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఉబ్బసం, ఇతర అంటూ వ్యాధులు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా చర్మం డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి కంటిన్యూగా ఏసీలో ఉండకుండా మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటే మంచిది. అలాగే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications