నిద్రలోనే 'గుండెపోటు'..? ఈ రూల్ పాటిస్తే సేఫ్..!
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా గుండె జబ్బులు అధికం అయ్యాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఉరుకుల పరుగుల జీవితం కావడంతో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే అనేక మందికి గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గుండె పోటు వచ్చే ముందు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, ఒళ్లు నొప్పులు, తల తిరిగినట్లుగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు తెలిపారు. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
అయితే ఈ మధ్య కాలంలో నిద్రలోనే గుండెపోటుతో చాలామంది అకాల మరణం చెందుతున్నారు. చాలామందికి నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వైపు ఆరోగ్యకరమైన నిద్రతో గుండె పదిలంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నా నిద్రలో వచ్చే గుండెపోటు ఇప్పుడు పెను సమస్యగా మారింది. నిద్రలో మన శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా గుండె పని చేస్తుందనేది మనకు తెలిసిందే. అయితే గుండె లయ తప్పడం, గుండెలోని ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు లాంటి సమస్యల కారణంగా నిద్రలో గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

అలాగే నిద్రపోయే ముందు డీప్ బ్రీత్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందంటున్నారు. నిద్ర పోయే ముందు డీప్ బ్రీతింగ్ సాధన చేయడానికి 4-7-8 రూల్ ను పాటించాలని వైద్యులు వివరిస్తున్నారు. అంటే 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం, 7 సెకన్ల పాటు శ్వాసను అలాగే బంధించడం.. 8 సెకన్లు పాటు శ్వాసను వదిలిపెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రూల్ ను క్రమం తప్పకుండా పాటించడం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.
-
వంకాయ ఎండురొయ్యల కూర.. ఇలా వండండి, అన్నం మెతుకు కూడా వదలరు నమ్మండి! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications