మట్టికుండ నీటితో ప్రయోజనాలు.. వైద్యులేమంటున్నారు?
నగరాలు, పట్టణాల్లో నివసించేవారు ఫ్రిజ్ వాటర్ తాగడానికి అలవాటుపడివుంటారు. అయితే ఇప్పటికీ చాలా నగరాల్లో ప్రజలు కుండలో ఉంచిన నీరు తాగడానికే ఇష్టపడుతుంటారు. మట్టికుండలో నీరు చల్లగా ఉండటమేకాకుండా ఎంతో ఆరోగ్యకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కుండలో నీరు తాగడంవల్ల జీవక్రియ పెరుగుతుంది. మట్టి సీసా లేదంటే మట్టి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎంతోమంది ఆయుర్వేద వైద్యులు వివరించి చెబుతున్నారు. మంచినీటి కుండలోని నీరును తాగడంవల్ల ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవక్రియ మెరుగుపడుతుంది:మట్టి కుండలు లేదా సీసాల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలోని సహజమైన మార్గంలో జీవక్రియ మెరుగుపడుతుంది. వేడి వాతావరణం వల్ల జీవక్రియకు వేసవి కాలంలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. జీవక్రియను మెరుగుపరచాలంటే కుండలో నీటిని త్రాగాలి. ఫ్రిజ్ లేదంటే ప్లాస్టిక్, స్టీల్, గాజు సీసాలతో పోలిస్తే మట్టి సీసాలోని పాత్రలో ఉంచిన నీరు సహజంగా చల్లబడుతుంది. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది:వాటిలో ఉంచిన నీటి ఉష్ణోగ్రత స్థాయి శరీరానికి సరిపోవడంతోపాటు సరిగ్గా హైడ్రేట్ చేస్తుంది. అలాగే శీతలీకరణ ప్రభావాన్ని కూడా ఇస్తుంది. ఫ్రిజ్లో చల్లటి నీరు తాగడం వల్ల గొంతు సమస్యలు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ కుండలో ఉంచిన చల్లటి నీరు తాగడం వల్ల అటువంటి ఇబ్బందులేమీ ఉండవు. కుండలో ఉండే నీరు ఫ్రిజ్ అంత చల్లగా ఉండదు కాబట్టి జలుబు, ఫ్లూ ఉన్న సమయంలో తాగినా గొంతుకు హాని జరగదు. అంతేకాదు వడదెబ్బను అరికట్టవచ్చు. కుండ నీటిలో ఖనిజాలు, విటమిన్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. శరీరం లోపలి భాగంలో చల్లగా ఉంచుతుంది.
దానంతటదే ఫిల్టర్ అవుతుంది:గ్యాస్, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటుంటే మంచినీటి కుండలో ఉంచిన నీరు తాగాలి.దీనివల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మట్టి కుండలో ఉంచిన నీరు 4 గంటల తర్వాత స్వయంచాలకంగా ఫిల్టర్ చేయబడుతుంది, దీనికి ఎటువంటి RO-UV ఫిల్టర్ అవసరం లేదు. ఇది ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది. ఆల్కలీన్ నీటి pH సమతుల్యతను సరిగ్గా నిర్వహిస్తుంది.












Click it and Unblock the Notifications