health tips: సాయంత్రం టీ తాగటం హానికరమా? తెలుసుకోండి!!
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడతారు. టీ తాగనిదే ఏ పనీ చేయలేక పోతున్నామని బాధపడేవారు కూడా ఉన్నారు. అయితే టీ తాగేవారు టీ ఎంత వరకు తాగితే మంచిది? ఏ సమయంలో తాగితే మంచిది? ఉదయం, సాయంత్రం టీ తాగడం మంచిదేనా? వంటి అనేక వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
టీ తాగేవారు ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే టీ తాగాలి. ఇక అతిగా టీ తాగితే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది పనుల ఒత్తిడిలో ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూనే ఉంటారు. రోజుకు చాలాసార్లు టీ తాగేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే అటువంటి వారు ఎక్కువగా టీ తాగకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక సాయంత్రం పూట టీ తాగడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.
సాయంత్రం పూట టీ తాగడం వల్ల శరీరంపై కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. భారతదేశంలో ఉన్న జనాభా 64% మంది ప్రతిరోజు టీ తాగడానికి ఇష్టపడతారు. అందులో 30 శాతం కంటే ఎక్కువ మంది సాయంత్రం ఖచ్చితంగా టీ తాగుతారు. అయితే వైద్య శాస్త్రం ప్రకారం సాయంత్రం టీ తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సాయంత్ర సమయంలో టీ తాగడం వల్ల టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్రలేమి సమస్యలు, లివర్ డిటాక్స్ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పడుకోవడానికి పది గంటలు ముందు కచ్చితంగా టీకి దూరంగా ఉండాలి. భారతదేశంలోని ప్రజలు పాలతో టీ ని చేసుకొని తాగుతారు కాబట్టి అది టీలో ఉండే అనేక ముఖ్యమైన మూలకాల శక్తిని తగ్గిస్తుంది.
పాలతో టీ చేసుకొని తాగడం అంత మంచిది కాదని కూడా చెప్పొచ్చు. రాత్రి సమయాలలో నైట్ షిఫ్టు డ్యూటీలు చేసేవారు అప్పుడప్పుడు సాయంత్రం సమయంలో టీ తాగొచ్చు. కానీ టీ తాగడం ఒక అడిక్షన్ లా చేసుకొని పదే పదే టీ తాగడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిదికాదు. ముఖ్యంగా సాయంత్రం వేళ టీ తాగకుండా మానేస్తేనే ఆరోగ్యానికి మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications