కుటుంబ శ్రేయస్సు కోసం జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేయాల్సినవి ఇవే
జ్యేష్ఠ పూర్ణిమ 2025 కుటుంబ భక్తికి, పూర్వీకుల స్మరణకు పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే వ్రతాలు వైవాహిక బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు శ్రేయస్సును, రక్షణను ప్రసాదిస్తాయి.
జ్యేష్ఠ పూర్ణిమ: విశిష్టత
జ్యేష్ఠ పూర్ణిమను వట్ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి. ఈ రోజును కుటుంబ సభ్యుల ఆయుష్షు, పూర్వీకులను స్మరించుకోవడానికి, విష్ణుమూర్తి- లక్ష్మీదేవిని ఆరాధించడం దీని ప్రత్యేకత. ఉపవాసం ఉండి మర్రిచెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు.

తేదీ, పూజా సమయాలు
- జ్యేష్ఠ పూర్ణిమ: 2025, జూన్ 11, బుధవారం
- పూర్ణిమ తిథి ప్రారంభం: 2025 జూన్ 10 ఉదయం 8:05
- పూర్ణిమ తిథి ముగింపు: 2025 జూన్ 11 ఉదయం 9:43
- పూర్ణిమనాడు చంద్రోదయం: 2025 జూన్ 11 రాత్రి 10:50
- ఉపవాస దినం (వ్రతం ప్రారంభం): 2025 జూన్ 10
జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత
జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. ఈ పూర్ణిమ రోజున ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా శ్రేయస్కరం. పూర్ణిమ వ్రతం శక్తిని, దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. తర్పణం, దానం చేయడం ద్వారా మన పూర్వీకులను గౌరవించుకోవాలి. కుటుంబ రక్షణ కోసం శ్రీమహావిష్ణువును, ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని భక్తులు పూజలు చేస్తారు.
వట్ పూర్ణిమ వ్రత విధానం
వివాహిత స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి కొత్త దుస్తులు ధరించి ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ మర్రిచెట్టుకు పూజలు చేస్తారు. పువ్వులు, అక్షతలు, బెల్లం కలిపిన నీటిని సమర్పిస్తారు. చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ దారాన్ని కడతారు. తరువాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. వ్రతం చేసినపుడు కట్టుకున్న దుస్తులను, నగలను వృద్ధ దంపతులకు దానం చేస్తారు. విష్ణువు, లక్ష్మికి సంబంధించిన మంత్రాలతో ఈ వ్రతం ముగుస్తుంది.
జ్యేష్ఠ పూర్ణిమ బిల్వత్రి రాత్రి వ్రతం
జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం నాడు వస్తే స్కంద పురాణంలో చెప్పిన విధంగా భక్తులు సంవత్సరం పాటు పూర్ణిమ వ్రతాలను ఆచరిస్తారు. మొదటి మంగళవారం నాడు వచ్చే పూర్ణిమ రోజున ఆవాలు కలిపిన నీటితో స్నానం చేసి చందనం, పువ్వులతో బిల్వ (మారేడు) వృక్షాన్ని పూజిస్తారు. ఆరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు. కుక్క, పంది లేదా గాడిద తాకిన ఆహారాన్ని తినకూడదు.
చివరి పూర్ణిమ నాడు బార్లీ, గోధుమలు, బియ్యం, నువ్వులు మొదలైన ధాన్యాలను సేకరించి బంగారు ఉమామహేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎర్రటి వస్త్రాలు, అగరబత్తులు, దీపాలు, నైవేద్యం సమర్పిస్తారు.
ఆధ్యాత్మిక అర్థం, ప్రయోజనాలు
ఈ వ్రతాలు, ఆచారాలు చేయడం వల్ల వైవాహిక బంధం బలపడుతుంది. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. దేవుడి రక్షణ, శ్రేయస్సు కలుగుతాయి. పౌర్ణమి వెన్నెల్లో చేసే పూజలు కుటుంబంలో ఐక్యతను కలిగిస్తాయి. పూర్వీకుల పట్ల కృతజ్ఞతను పెంపొందిస్తాయి. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆయుష్షు పెరుగుతుంది.
జ్యేష్ఠ పూర్ణిమ 2025 కుటుంబ భక్తి, పూర్వీకుల స్మరణ, దైవారాధనల కలయిక. వట్ పూర్ణిమ వ్రతం, తర్పణ సమర్పణలు, బిల్వత్రి ఆచరణల ద్వారా ఆధ్యాత్మిక, కుటుంబ బంధాలు బలపడతాయి. దీనివల్ల దీర్ఘాయువు, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి.












Click it and Unblock the Notifications