ఈ నెల 29, 30, 31 తర్వాత నుంచి ఈ రాశుల తలరాత మారుతోంది
గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని మంచి యోగాలను ఏర్పరిచి కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోనాలు కలిగిస్తుంటాయి. అలాగే దేవతల గురువైన బృహస్పతి.. చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం అక్టోబరు నెలలో చివరి మూడురోజులు మాత్రమే ఉంటుంది. దీనివల్ల 5 రాశులవారి జీవితం అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మకర రాశి
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఉన్నవారు విజయాన్ని అందుకుంటారు. ప్రత్యర్థులంతా దూరమవుతారు. మీరు కల కంటున్న వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

కన్యా రాశి
నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. కొత్తగా ఇంటిని లేదంటే భూమిని కొనాలనుకుంటున్నవారికి గురువు బలం లబ్ధి చేకూరుతుంది. ఆస్తిని అమ్మాలనుకుంటున్నవారు కూడా ఈ సమయంలో అమ్మొచ్చు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి.
తులా రాశి
వ్యాపారంలో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబంలో శుభకార్యం ఉంది. గొడవలన్నీ సద్దుమణుగుతాయి.
వృశ్చిక రాశి
ఉద్యోగులు విదేశాలకు వెళతారు. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. కుటుంబంలో పెళ్లి జరుగుతుంది. వృత్తిలో ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కోరుకున్న రంగాల్లో దశలవారీగా ఉన్నత స్థానాన్ని అలంకరిస్తారు.
కర్కాటక రాశి
కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థులపై విజయం సాధించడానికి దీన్ని మంచిన అనువైన సమయం ఉండదు. చంద్రుడి చల్లనిచూపు వీరిపై ఉంటుంది.












Click it and Unblock the Notifications