చంద్ర గ్రహణం రోజు ఈ రాశులవారికి కలిసివస్తుంది
ప్రతి సంవత్సరం మే నెలలో బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. వైశాఖ పూర్ణిమ (బుద్ధ పూర్ణిమ)ను బీహార్ లో వైభవంగా జరుపుకుంటారు. ప్రాచీన కాలం నుంచి బుద్ధ పూర్ణిమను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. బుద్ధ భగవానుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించాడు కాబట్టి ఈ రోజు ఎలాంటి పనులు చేసినా మంచి ప్రయోజనాన్ని పొందుతామనే నమ్మకం బలంగా ఉంది. ఈ క్రమంలోనే పలు రాశులవారికి బాగా కలిసివస్తుందని, వారు లాభాలను పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రస్తుత తరంలో బుద్ధ పూర్ణమ అంటే ఎవరికీ తెలియదు. పూర్ణిమ గురించి, దాని ప్రత్యేకత, ఏయే రాశులవారు లాభాలు పొందుతారో తెలుసుకుందాం.
బీహార్ లోని గయ జిల్లాలో జన్మించిన బుద్ధుడు ఉసిరిచెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం పొందాడని నమ్ముతారు. అందుకే ఇక్కడ బుద్ధుడి ఆలయాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో బుద్ధుని విగ్రహం పద్మాసన భంగిమలో ఉంటుంది. ఆయన్ని విష్ణువు అవతారంగా కొలుస్తారు. భారతదేశంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా బోధ్ గయను భావిస్తారు.

బుద్ధుడిని ఎందుకు పూజిస్తారంటే.. :వైశాఖ పూర్ణిమ రోజు జన్మించడంతో విష్ణువు అవతారం భావిస్తారు. పౌర్ణమి రోజున బుద్ధుణ్ని పూజించడం వల్ల చంద్రుడి వల్ల ఏర్పడే దోషాలు తొలగిపోతాయని బలంగా విశ్వసిస్తారు. కుటుంబంలో సంతోషం, మానసిక ప్రశాంతత నెలకొనడంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆ సమయంలో ఉపశమనం లభిస్తుంది.
ఈ రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది:మకర, సింహ, మిథున, మీన, కుంభ రాశుల వారికి బుద్ధ పూర్ణిమ చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. అన్నిరకాలుగా కలిసివస్తుంది. ఎలాంటి పనులు చేసిన భారీ లాభాలు పొందుతారు. మకర రాశి వారు వృత్తిలో అభివృద్ధి సాధిండానికి, మిథున రాశి వారికి ఐశ్వర్యంతో పాటు సంతోషం లభిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సింహ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి ఉండటంతోపాటు పదోన్నతులు కూడా లభిస్తాయి.












Click it and Unblock the Notifications