నవ్వులనావకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్ః మూడు దశాబ్దాల పాటు తెలుగునేలను నవ్వులతో ముంచెత్తిన హాస్యబ్రహ్మ జంధ్యాలకు వందలాది మంది అభిమానుల అశ్రునీరాజనాల మధ్య బుధవారం అంత్యక్రియలు జరిగాయి. సినీ రచయిత, సంభాషణకర్త, దర్శకుడు జంధ్యాల మంగళవారం గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఆయన భౌతిక కాయాన్ని అభిమాను సందర్శనార్థం ఆయన స్వగృహం వద్ద వుంచారు.
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, చిరంజీవి తదితర ప్రముకులు జంధ్యాల భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. సినీ, నాటక రంగానికి చెందిన వందలాది మంది వెంటరాగా బుధవారం మధ్యాహ్నం పంజగుట్ట శ్మశాన వాటికలో జంధ్యాల అంత్య క్రియలు జరిగాయి.
జంధ్యాలకు నివాళులు అర్పించేందుకు వచ్చిన హాస్య చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్ దుఃఖాన్ని ఆపుకోలేక భోరున విలపించారు. బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, తనికెళ్ళ భరణి, ఐరన్ లెగ్ శాస్త్రి తదితరులు నవ్వలకు చిరునామా అయిన జంధ్యాలుకు అశ్రు నీరాజనాలు అర్పించారు. తెలుగు వారికి అందమైన మాటను...... ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన నవ్వుల నావ ఇక తిరిగి రానంటూ అనంతలోకాలకు వెళ్ళిపోయింది.
-
హాస్యబ్రహ్మ
జంధ్యాల
హఠాన్మరణం