శిఖరాగ్ర ఫలితంవుంది: మహాజన్
సివ్లూ: ఆగ్రా శిఖరాగ్ర సమవేశం భారత,పాకిస్థాన్ల మధ్య సానుకూల అవగాహనకు దోహదంచేశాయని సమాచార, సాంకేతిక శాఖ మంత్రిప్రమోద్ మహాజన్ అన్నారు. కార్గిల్ యుద్ధానంతరం ఉభయదేశాల మధ్య నెలకొన్ని ప్రచ్ఛన్న వైషమ్యాలు తొలిగిపోవడానికి ఈ సమావేశందోహదపడిందని ఆయన ఆదివారం విలేకరులతోఅన్నారు.
పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్, భారత ప్రధాని అటల్ బిహారీవాజ్పేయిల మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశం పరిమిత ఫలితంసాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన సొంతదేశం సరిహద్దు రేఖను వివాదంగా అంగీకరించబోరని,అలా అంగీకరించి ఏ ప్రధాని కూడా ఒప్పందంపై సంతకంచేయరని ఆయన అన్నారు.
సంయుక్తఒప్పందంపై సంతకాలు జరగకుండా అదృశ్యహస్తం వున్నదనే అరోపణలను ప్రస్తావించగా అదేనిజమైతే ఆ వ్యక్తి దేశానికి ఎంతో సేవ చేసినవాడవుతాడనిప్రమోద్ మహాజన్ అన్నారు.












Click it and Unblock the Notifications