ఇండియన్ ఐటిపై గార్ట్నర్ బుల్లిష్
న్యూఢిల్లీః మాంద్యంతో వార్తలతో నిమిత్తం లేకుండా భారతీయ ఐటి రంగం రానున్న కొద్ది సంవత్సరాల్లో 50 శాతం స్థూల వార్షిక వృద్ధిరేటుతో పురోగమించే అవకాశం వున్నదని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ అభిప్రాయపడింది. అయితే వృద్ధిపథంలో సాగడానికి వీలుగా భారతీయ ఐటి సంస్థలు వాల్యూ అడిషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని గార్ట్నర్ సూచించింది.
2000 సంవత్సరంలో భారతీయ ఐటి రంగం టర్నోవర్ 400 కోట్ల డాలర్లు వుండగా 2001 నాటికి ఈ టర్నోవర్ 600 కోట్ల డాలర్లకు చేరిందని ఆ సంస్థ వెల్లడించింది. మునుముందు కూడా ఇదే వృద్ధిరేటు కొనసాగే అవకాశాలే హెచ్చుగా వున్నాయని ఆ సంస్థ చెప్పింది. అయితే ఇందుకు భారతీయ ఐటి సంస్థలు కొన్ని వ్యాపార సూత్రాలను పాటించాలని గార్ట్నర్ సూచించింది. అప్లికేషన్స్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్కు ఐటి రంగంలో అత్యధిక రెవెన్యూ సాధించగల సత్తా వున్నదని గార్ట్నర్ తెలిపింది.
ప్రాడక్ట్డెవలప్మెంట్, బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్ సోర్సింగ్పై భారతీయ సంస్థలు దృష్టి నిలపాలని సంస్థ సూచించింది. ఇప్పటివరకు భారతీయ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో విజయవంతమైన సాఫ్ట్వేర్ ప్రాడక్ట్ ఒక్కదానిని కూడా డెవలప్చేయలేకపోయాయని ఈ విషయం గుర్తుంచుకుని ముందడుగు వేయాలని గార్ట్నర్ సలహా ఇచ్చింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు అదే సమయంలో మార్కెటింగ్ నైపుణ్యం కూడా భారతీయ సంస్థలు అలవర్చుకోవాలని గార్ట్నర్ సూచించింది.