వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో 500 మండలాలకు వెలుగు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః దారిద్ర్య రేఖ దిగువన వున్న నిరుపేదలను ఆదుకొనే లక్ష్యంతో చేపట్టిన వెలుగు పథకాన్ని మరో 500 మండలాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఇప్పటికి 108 మండలాల్లో ఈ పథకం అమల్లో వుంది. వెనుకబడిని జిల్లాలకు చెందిన మరో 500 మండలాలను గుర్తించి వెలుగు పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వెలుగు పథకంపురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వెలుగు పథకం కింద ఇప్పటికే 6 లక్షల కుటుంబాలు లబ్దిపొందాయని సమావేశంవివరాలను విలేకరులకు వెల్లడించిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 8 నెలల కిందట తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినవిషయం విదితమే. 550 కోట్ల రూపాయలతో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.
ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రపంచబాంక్‌ రెండు వేల కోట్లు రూపాయల ఆర్థిక సాయంఅందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన పోచారం చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X