వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాముకాటుకు ముగ్గురు పసివాళ్ళు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురంః అనంతపురం పట్టణ శివారులోని కందుకూరులో శనివారం ఉదయంఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పసివాళ్ళు పాముకాటుకు బలయ్యారు. నారాయణ ముగ్గురు పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిని పాము కాటేసింది. ఇంట్లోనే పాముపుట్ట వుండగాఅందులో నుంచి వచ్చిన పాము ఈ ముగ్గురుని బలిగొంది.

నాగేంద్రస్వామి భక్తుడైన నారాయణ చాలాకాలంగా తన ఇంట్లో వున్న పాముల పుట్టకు పూజలు నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం ఉదయాన్నే నిద్రిస్తున్న తన కుమారుడుపెద్దగా కేకవేయడంతో అతనిని పరిశీలించగా పాము కాటేసినట్లు గుర్తించానని,అప్పటికే ఆ పాము మిగిలిన ఇద్దరిని కూడా కాటేసిందని నారాయణ చెప్పాడు. ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ తన ముగ్గురు పిల్లలకు నాగేంద్ర, నాగమ్మ, నాగరాజు అనిపేర్లు కూడా పెట్టానని, ఇప్పుడు ఆ నాగేంద్రుడే సంతానాన్ని హరించాడని అతను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.

నారాయణ పాముకోసం గాలించగా పిల్లలు నిద్రపోతున్న దిండుకిందే అది కనబడింది. ఇరుగుపొరుగులు ఆ పామును కూడా చంపారు. ఈ సంఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X