రాష్ట్ర బిజెపిపై అద్వానీకి బాబు ఫిర్యాదు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీకి ఫిర్యాదు చేశారు. ఆయన శుక్రవారం అద్వానీతో సమావేశమై జాతీయ రాజకీయాల గురించి, రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపి సంబంధాలపై చర్చలు జరిపారు.
ఎన్డీయే ప్రభుత్వానికి తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నప్పటికీ బిజెపి రాష్ట్ర శాఖ సహాయ నిరాకరణ వైఖరి అవలంభిస్తోందని ఆయన అద్వానీకి ఫిర్యాదు చేసినట్లు భోగట్టా. బిజెపి రాష్ట్రసీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలుగజేస్తున్నాయని చంద్రబాబు కేంద్ర మంత్రికి చెప్పినట్లు సమాచారం. బిజెపి మనోభావాలుదెబ్బ తినేలా తాను ఏనాడూ వ్యవహరించలేదని ఆయనవివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవలి జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో బీ-ఫారం జారీపైఏర్పడ్డ అపోహల గురించి, గందరగోళంపై ఆయన అద్వానీకివివరించారు.