వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు విద్యుత్‌ ప్రాజెక్టులకు నిధులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ఆరు పెండింగ్‌విద్యుత్‌ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు వివిధ ఆర్థిక సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పించింది. ముందుగానేఎస్క్రో ఖాతా తెరవకుండానే ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ వివిధ ఆర్థిక సంస్థలు శుక్రవారం ఇక్కడ ఎపిట్రాన్స్‌కోతో అవగాహనా పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ ఎంఓఎలపై ఎపిట్రాన్స్‌కో తరఫున చైర్మన్‌ రమాకాంత్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫునవిద్యుత్‌ కార్యదర్శి సంపత్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, ఐడిబిఐ ప్రతినిధులు సంతకాలు చేశారు. కేంద్రవిద్యత్‌ కార్యదర్శి ఎ.కె. బసు సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి. దీనిని ఐబిబిఐ డైరెక్టర్ల బోర్డు ఆమోదించాల్సి వుంటుంది.

మొత్తం 2,239 మెగవాట్లవిద్యుదుత్పాదన సామర్థ్యం గల ఆరు వేర్వేరు ప్రాజెక్టుల కోసంఎస్క్రో (ఉత్పత్తి ప్రారంభం కాగానే ముందు నిధులు సమకూర్చిన సంస్థకు రుణాలు తిరిగి చెల్లించి ఆ తర్వాతే వేరే ఖర్చుల వైపు దృష్టి మళ్లించడం) అవసరం లేకుండానే ఆర్థిక సంస్థలు నిధులు సమకూర్చడానికి ముందుకు రావడంవిశేషం. కేవలం పవర్‌ ప్రాజెక్టులు వాణిజ్యపరంగా పనిచేయడం ప్రారంభించడానికి 30 రోజుల ముందుఎస్క్రో ఖాతాలు తెరిస్తే చాలునని సంస్థలు అంగీకరించాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రిసురేష్‌ ప్రభు ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఎంఒయులపై తుది నిర్ణయం తీసుకున్నారు. తాజా ఎంఒయుల ద్వారా నిధులుఅందుకోనున్న వాటిలో బిపిఎల్‌ గ్రూప్‌నకు చెందిన రామగుండం థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, నిప్పన్‌ డెన్సో ఇస్పత్‌ గ్రూప్‌నకు చెందిన వేమగిరి సిసిజిటి, జివికె ఇండస్ట్రీస్‌ సారథ్యంలోని జేగురుపాడు-2 ప్రాజెక్టు, గౌతమి పవర్‌ లిమిటెడ్‌ సారథ్యంలోనిపెద్దాపురం ప్రాజెక్టు, బిఎస్‌ఇఎస్‌ ఆంధ్రా పవర్‌ లిమిటెడ్‌కు చెందిన సామర్లకోట ప్రాజెక్టు, కోనసీమ ఈపిఎస్‌ ఓక్‌వెల్‌ పవర్‌ లిమిటెడ్‌కు చెందిన కోనసీమ ప్రాజెక్టులు వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X