వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మనిషే సుబ్రహ్మణ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: యూనిట్‌ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌ సుబ్రహ్మణ్యాన్ని ఎఐఎడిఎంకె అధినేత్రి జయలలిత సిఫారసు పైనే యుటిఐ చైర్మన్‌గా నియమించినట్టుగా ఎన్‌డిఎ కన్వీనర్‌ జార్జ్‌ఫెర్నాండెజ్‌ ప్రకటించారు. అప్పట్లో ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా వున్న జయలలిత యుటిఐ చైర్మన్‌గా సుబ్రహ్మణ్యం నియామకానికి పట్టుబట్టారని జార్జ్‌ చెప్పారు. జయలలిత చెప్పిన తర్వాత తానే స్వయంగా సుబ్రహ్మణ్యం పేరును ప్రధాని కార్యాలయం పరిశీలనకోసం పంపాననిఆయన చెప్పారు.

సుబ్రహ్మణ్యంతో తనకెలాంటి సంబంధం లేదంటూ జయలలిత చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. యుటిఐసంక్షోభంలో అరెస్టయిన సుబ్రహ్మణ్యం జయలలిత మనిషంటూ వార్తలు రావడంతో జయ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు.అసలు సుబ్రహ్మణ్యం ఎవరో తనకు తెలియదని ఆమె శనివారం నాడు ఒక ప్రకటన చేశారు.

అయితే ఆమె ప్రకటన అబద్దమనిస్వయంగా తనతోనే ఆమె సుబ్రహ్మణ్యం పేరను ప్రస్తావించారని జార్జ్‌ ఆదివారం నాడు చెన్నైలోవిలేకరుల సమావేశంలో చెప్పారు. ఇదిలా వుండగా జయలలిత ప్రభుత్వాన్ని రద్దు చేసే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. డిఎంకె నేత కరుణానిధిఅరెస్టు వ్యవహారంలో జయలలిత ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం వున్నదంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తృణమూల్‌ను మళ్లీ ఎన్‌డిఎలో చేర్చుకునేవిషయం త్వరలో జరుగనున్న ఎన్‌డిఎ సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X