కృషీవలునికిపెద్దల అండ!!
హైదరాబాద్ః కృషి బ్యాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ప్రముఖుని అండదండలతో పాటు కొందరు సీనియర్ పోలీసు అధికారుల మద్దతువున్నదని అంటున్నారు. ఈ అండదండలతోనే ఒక పథకం ప్రకారం డిపాజిటర్లను వెంకటేశ్వరరావు మోసగించినట్టుగా చెబుతున్నారు.
ఎక్కువ వడ్డీ ఆశతో కొందరురిటైర్డ్ ఐపిఎస్ అధికారులు కూడా పెద్దమొత్తాలను కృషిలో డిపాజిట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఒకసీనియర్ ఐపిఎస్ అధికారి కొడుక్కు ఈ బ్యాంకులో వాటాలు వున్నాయని కూడాఅంటున్నారు. సదరు ఐపిఎస్ అధికారి చక్రం అడ్డువేయడం వల్లనే సకాలంలో పోలీసులు రంగంలోకి దిగి బ్యాంకు డైరెక్టర్లనుఅరెస్టు చేయలేకపోయారని అంటున్నారు. గత ఏడాది జరిగిన తనపెళ్లి సందర్భంగా సదరు ఐపిఎస్ అధికారి కొడుకు భార్యకు వెంకటేశ్వరరావు 16 లక్షల రూపాయలవిలువజేసే చీరెను గిఫ్ట్గా ఇచ్చినట్టు చెబుతున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని వెంకటేశ్వరరావు వుంటున్న ఇంట్లో విలాసవంతమైన వస్తువులు అనేకం వున్నాయని అయితే అవన్నీ లీజుపై తెచ్చుకున్నాడని అంత ఖరీదైన ఇంట్లో ఆయన సొంతమని చెప్పడానికి పాతిక వేలవిలువజేసే వస్తువులు కూడా లేవని పోలీసులుఅంటున్నారు.
వెంకటేశ్వరరావు అమెరికా వెళ్లినట్టుగా బ్యాంకు ఉద్యోగులు చెప్పిన కథనాన్ని నమ్మి వారంరోజులుగా వ్యవహారాన్ని నానుస్తున్న పోలీసుల ఇప్పుడు వెంకటేశ్వరరావు ఢిల్లీ లేదా ముంబాయిలో వుండవచ్చనిఅంటున్నారు. నిజానికి వెంకటేశ్వరరావు దేశం విడిచివెళ్లాడా లేదా ధృవీకరించుకోవడం పోలీసులకు చిటికెలో పని అని అయితే ఆ పని వారెందుకు చేయడం లేదోఅర్ధం కావడం లేదని అదే శాఖకు చెందిన కొందరుసీనియర్ అధికారులు అంటున్నారు. పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయంతోనే వెంకటేశ్వరరావు జనానికి కుచ్చుటోపీ పెట్టాడని వారు చెబుతున్నారు.
కృషిడిపాజిట్లకు బీమా లేదు
-
కృషి
చైర్మన్
ఆంధ్రలోనే
దాగున్నాడు