తెలుగుదేశం హత్యా రాజకీయాలు
హైదరాబాద్ః ప్రత్యర్ధి పార్టీలను తుదముట్టించడానికి తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆరోపించింది.
గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయని లీగల్సెల్ పేర్కొన్నది. ఈ దాడులపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ను శనివారం నాడు కలసి లీగల్సెల్ నాయకులు ఒక వినతి పత్రం సమర్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీవారిపై వివిధ ప్రాంతాల్లో నమోదయిన 500 క్రిమినల్ కేసులను ఎత్తివేశారని కూడా కాంగ్రెస్ ఆరోపించింది.












Click it and Unblock the Notifications