వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాస్త్రజ్ఞులపై విషప్రయోగం?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరంలోనిసెంట్రల్‌ కోర్టు హోటల్‌ లో 60 మంది శాస్త్రవేత్తలు ఒకేసారిఅస్వస్థతకు లోనవడంపై పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు.

హోటల్‌ యాజమాన్యం పై కోసు నమోదు చేసి విషపూరిత ఆహారం ఎలా తయారైందనేఅంశంపై దర్యాప్తు ప్రారంభించారు. ఓ స్టార్‌ హోటల్‌ లో ఇలా జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఆహారం విషపూరితం కావడం వంటవాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగిందా లేక ఎవరైనా కుట్ర పన్ని శాస్త్రవేత్తలకు వడ్డించిన ఆహారంలోవిషం కలిపారా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సెంట్రల్‌ కోర్టు వంటవాళ్లను, చెఫ్‌ ను సైఫాబాద్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు అస్వస్థత కారణంగా మూడురోజులుగా వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారు మెల్లిగా కోలుకుంటున్నారు. సాధారణంగా కలుషితి ఆహారం తిన్నవారు ఒకటి రెండు రోజుల్లో కోలుకుంటారు. అయితే శాస్త్రవేత్తలు మూడు రోజులైనా కోలుకోక పోవడంతో తీవ్రమైన కలుషితాహారం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X