వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిఎస్‌పి ఎమ్మెల్యేల రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నోః కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బాటలోనే ఉత్తరప్రదేశ్‌లో 46 మంది బిఎస్‌పి ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వెంటనే జరిపించాలని అధికార పార్టీ పై వత్తిడికి విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం విదితమే. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి అక్టోబర్‌ 17తోనే ముగిసింది.

అయితే ప్రభుత్వం మాత్రం రాజ్యాంగం ప్రకారం లభించే మరో ఆరునెలల గడువును కూడా వాడుకుని వచ్చే ఏడాది ఎన్నికలు జరిపించే ప్రయత్నాల్లో వుంది.అసెంబ్లీ గడువు ముగిసిన కారణంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు ఆ పార్టీ నేత మాయవతి చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల వెంటనే జరిపించాలనే డిమాండ్‌తో గతనెలలోనే సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినవిషయం విదితమే. ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకునిఅసెంబ్లీ ఎన్నికలు వెంటనే జరిపించాలని బిఎస్‌పి కోరింది. ప్రతిపక్షం లేని సభఅర్ధరహితమని ముఖ్యమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌తో రాజీనామా చేయించి రాష్ట్రపతిపాలన విధించి ఎన్నికలు జరిపించాలని ఆమెకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X