ఐదుగురు ప్రతిపక్షకమాండర్ల ఉరి: తాలిబాన్
కాబూల్: ప్రతిపక్షకమాండర్లను ఐదుగురిని ఉరి తీసినట్లు తాలిబాన్ శనివారంప్రకటించింది. ఇందులో సీనియర్ కమాండర్మహమ్మద్ బిలాల్ కూడా వున్నారు. వీరిని ఉత్తరఅఎn్ఘానిస్థాన్లో పట్టుకుని ఉరి తీసినట్లు తాలిబాన్ప్రకటించుకుంది. అబ్దుల్ హక్నుఇప్పటికే తాలిబాన్ చంపిన విషయం తెలిసిందే.
దార్- ఎ- సౌఫ్నుతాలిబాన్ తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాతఐదుగురు కమాండర్లను, 15 మంది ఫైటర్లనుపట్టుకుంది. ఆ తర్వాత వారిని ఉరి తీసినట్లు పెషావర్కుచెందిన పాకిస్థాన్ ఇస్లామిక్ ఏజెన్సీ చెప్పింది.తాలిబాన్ ఇంటలిజెన్స్ వ్యవస్థ పన్నిన వ్యూహరచనలోఅబ్దుల్ హక్ చిక్కుకున్నారని మీడియా రాసింది.
ప్రధానమైనతాలిబాన్ కమాండర్లను కలుసుకోవడానికిహిసారక్ జిల్లాలోని తన ఇంటి నుంచి సోమవారంబయలుదేరాడు. తాలిబాన్ ఇంటలిజెన్స్ పన్నిన కుట్రకు బలిఅయ్యే ప్రమాదం వుందని ఆయనకు సలహాలు కూడాఅందాయి అని ది న్యూస్ అనే పత్రిక రాసింది. కాల్చి చంపడానికిముందు హక్ను, ఆయన అనుచరులిద్దరిని 20 గంటలకుపైగా విచారించినట్లు పాకిస్థాన్ ఇంటలిజెన్స్ వర్గాలుఅంటున్నాయి. హక్ను హత్య చేయాలని తాలిబాన్చాలా కాలంగా అనుకుంటోందని, ముల్లా ఒమర్స్థానంలో హక్ను నిలబెట్టేందుకు యూరప్,అమెరికా కార్యరంగం సిద్ధమే చేయడానికే దానికి కారణమని ఆవర్గాలు అంటున్నాయి.