పూరిః అంతర్జాతీయ ప్రసిద్ధికెక్కిన 13వ శతాబ్ధపు పూరీ జగన్నాథుని ఆలయంలో ఆదివారం వేకువజామున దొంగతన జరిగింది. దొంగలు అత్యంత లువైన మదనమోహనుని గ్రహాన్నిఅపహరించుకుపోయారు.
ఈ గ్రహంతో పాటు మరో రెండు గ్రహాలు కూడా చోరీఅయినట్టుగా పోలీసులు చెప్పారు. జగత్ ప్రసిద్ధ జగన్నాథుని రథయాత్రంలో మదనమోహనుని గ్రహాన్నే ఉత్సవగ్రహంగా ఊరేగిస్తారు. మూలరాట్టు ప్రతినిధిగా ఈ గ్రహాన్ని గర్భగుడిలోని సింహాసనంపై వుంచుతారు.
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. శనివారం నాడు రాత్రి బాగా పొద్దుపోయే వరకు పూజాకార్యక్రమాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. పూజలు ముగించి ఇళ్లకు వెళ్లిపోయినఅర్చకులు ఆదివారం వేకువనే తిరిగి ప్రాతఃకాల పూజలకోసం ఆలయానికి వచ్చేసరికి గర్భగుడి తలుపులు పగలగొట్టి వున్నట్టుగా పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనపై దర్యాప్తునకుఒరిస్సా ముఖ్యమంత్రి ఆదేశించారు. కొద్దిరోజుల క్రితమే భువనేశ్వర్లోని పురాతన లింగరాజు ఆలయంలోఅమూల్యమైన గ్రహాల చోరీ జరగడం దాని వెనకనే ఈ సంఘటన జరగడంతో రాష్ట్రప్రజల్లో తీవ్ర కలవరం ప్రభుత్వ అసమర్ధతపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.












Click it and Unblock the Notifications