వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగిత్యాలలో సబ్‌స్టేషన్‌ ముట్టడి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌:విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ గురువారం నాడు కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో భారీ ఆందోళనను చేపట్టింది. పార్టీ కార్యకర్తలు, రైతులువిద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. ఎంతకీ శాంతించకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పెంచిన కరెంట్‌ ఛార్జీలను తగ్గించే వరకు ఆందోళననువిరమించబోమని ఈ ఆందోళన కార్యక్రమానికిహాజరైన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు చెప్పారు. ఏప్రిల్‌ 9వ తేదీన జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆందోళన కార్యక్రమాలను ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఆందోళనకారులు దాదాపు మూడు గంటల పాటు కరీంనగర్‌, నిజామాబాద్‌ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ శాసనసభ్యులు జీవన్‌ రెడ్డి, డి. శ్రీధర్‌ బాబు, రత్నాకర్‌ రావు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X