వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం విధానాలు మారలేదు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గతఇరవై యేళ్లలో తమ పార్టీ విధానాలు మారలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవనంలో పార్టీ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావువిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ రెండు దశాబ్దాల్లో తాము రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సమర్థ నాయకత్వాన్నిఅందించగలిగామని ఆయన చెప్పారు. పార్టీ కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి అన్ని పార్టీలుపేదరిక నిర్మూలన, అభివృద్ధి, తదితర విషయాల గురించి మాట్లాడుతున్నాయే తప్ప పరిస్థితిలో మార్పు తేలేకపోయాయని, తెలుగుదేశం వచ్చిన తర్వాతనే ప్రజల జీవన ప్రమాణాలుపెరిగాయని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తోందని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. పార్టీని గ్రామ స్థాయి వరకు తీసికెళ్లగలిగామని ఆయన చెప్పారు. యువతరం అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీలో మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X