వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టపగలు దోపిడి, మహిళ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:విజయవాడలో పట్టపగలు ఓ ఇంట్లో అగంతకుడు చొరబడి దొంగతనానికి పాల్పడమే కాకుండా, గృహిణిని హత్య చేశాడు. పట్టణంలోని ఓ ఇంట్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అగంతకుడు చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంటి యాజమానురాలు కమలాకుమారి మాత్రమే ఉంది. అద్దె కోసం వచ్చాను అంటూ తలుపు తట్టాడు. ఇల్లు చూపించమని కోరడంతో ఆమె అతన్ని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ ఆగంతకుడు ఇంట్లోకి రాగానే, ఆమెను బెదరించి బంగారు నగలు తీసుకొని, బీరువాలోని 10 వేల రూపాయల నగదు తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.

కమలాకుమారి అరుపులు పెట్టడంతో ఆమె కడుపులో కత్తితో రెండు పోట్లు పొడిచి డబ్బు, నగలు తీసుకొని పారిపోయాడు. కేకలు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి ఆ హంతకుడు పారిపోయాడు. కమలాకుమారిని ఆసుపత్రికి వెళుతుండగానే మరణించింది. పట్టపగలే హత్యచేసి పారిపోయిన ఆగంతకుడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X