వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రైపాక్షిక చర్చల వల్లే ఫలితం: హురియత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాస్తవమైన సమస్యను త్రైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించాలని హురియత్‌ కాన్ఫరెన్స్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. కాశ్మీర్‌ కమిటీకి, పాకిస్థాన్‌లోని కమిటీకి మధ్య చర్చలకు వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గనీ భట్‌ తెలిపారు.

చర్చల ప్రక్రియను కొనసాగించడానికి తాను పాకిస్థాన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ జలీల్‌ ఎ. జిలానీతో మరో మారు మాట్లాడుతానని, కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి నిర్దిష్టమైన ఫలితం రాబట్టే ప్రయత్నంలో ఇదొక భాగమని ఆయన అన్నారు. భారత్‌, పాకిస్థాన్‌, కాశ్మీర్‌ ప్రజల త్రైపాక్షిక చర్చల ద్వారానే కాశ్మీర్‌ సమస్య పరిష్కారమవుతుందని, అందుకు వివిధ స్థాయిల్లో తలుపులు తెరిచి ఉంచడం అవసరమని ఆయన అన్నారు.

త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, అది కాశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని, ఫలప్రదమైన చర్చల కోసం ఇరు పక్షాలవారిని భాగస్వాములను చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ బలవంతుడని, ముషార్రప్‌ పాలనలో చర్చలు ప్రారంభమైతే ఫలితాలు ఉండగలవని, ఈ నిజాన్ని అంగీకరించాలని ఆయన అన్నారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయని, ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలు ముఖ్యమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X