ప్రాజెక్టుటెండర్లపై అఖిల పక్షం అనవసరం:వైయస్
కర్నూలు:నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలోహైకోర్టు ఆదేశాల మేరకునడుచుకంటామని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు.కర్నూలు జిల్లాలో రాజీవ్ పల్లెబాటకార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రిబుధవారం విలేకరులతోమాట్లాడారు.
నీటిపారుద ప్రాజెక్టుల టెండర్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సినఅవసరం లేదని ఆయన అన్నారు. పనికిఆహారం పథకం బియ్యాన్ని పందికొక్కుల్లామెక్కిన తెలుగుదేశం పార్టీనాయకులకు తమను విమర్శించేనైతిక హక్కు లేదని ఆయన అన్నారు.తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకుఒక్క దోపిడీ కూడా జరగలేదని ఆయనచెప్పారు. ప్రాజెక్టులకు రుణ సహాయంలభిస్తుండటం వల్ల తాము ముందుకుసాగుతుంటే ఓర్వలేక తెలుగుదేశంపార్టీ తమపై విమర్శలు చేస్తోందనిఆయన అన్నారు.సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం సహాయంచేయడానికి ముందుకు వచ్చిందని,అనుమతులు ఇస్తామని చెప్పిందని,ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలుఅప్పులు ఇవ్వడానికి సిద్ధపడ్డాయని, దీంతోప్రాజెక్టులు ముందుకు సాగుతాయనేఉద్దేశంతో వాటిని అడ్డుకోవడానికితెలుగుదేశం పార్టీ విమర్శలుచేస్తోందని ఆయన అన్నారు. ప్రాజెక్టులగురించి పూర్తి చేయండి చూద్దామనిఅసెంబ్లీలో తెలుగుదేశం నాయకులుఅన్నారని, సాధ్యం కావని భావించినప్రాజెక్టులను పూర్తి చేయడానికి తాముఏర్పాట్లు చేసుకోవడంతో వెనక్కు లాగేప్రయత్నం చేస్తున్నారని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications