వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కూతురితో సహా టీచర్ అనుమానాస్పద మృతి
కరీంనగర్: కరీంనగర్లోని మంకమ్మతోటలో ఒక ఉపాధ్యాయురాలు, అమె కూతురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉపాధ్యాయురాలు పద్మ, అమె కూతురు ఆత్మహత్య చేసుకున్నారనే ఒక వాదన వినిపిస్తుండగా దాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయుడు వేధించడం వల్ల ఆ వేధింపులను భరించలేక ఉపాధ్యాయురాలు తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, అత్తింటివారి ఆరళ్లు భరించలేక ఆమె, ఆమె కూతురు మరణించినట్లు మరో వాదన వినిపిస్తోంది. అయితే ఈ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడానికి వారు ఇష్టపడటం లేదు. ఉపాధ్యాయురాలు, తన కూతురితో మరణించిన ఈ సంఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
Comments
Story first published: Friday, April 29, 2005, 23:53 [IST]