ఆంధ్రా అధికారిని తప్పించండి: ధరంసింగ్
బెంగుళూర్: కేంద్ర నీటిపారుదల శాఖలోని ఆంధ్రా అధికారి హరినారయణను తొలగించాలని కర్ణాటక ముఖ్యమంత్రి ధరం సింగ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కోరారు. ఈ మేరకు తాను ప్రధానికి ఒక లేఖ రాసినట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులకు చెప్పారు. తన విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా ప్రతిస్పందించినట్లు కూడా ఆయన తెలిపారు. హరినారాయణ ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేలా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. హరినారాయణ కేంద్ర జలసంఘంలో కార్యదర్శిగా పని చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని ధరంసింగ్ నేతృత్వంలో కర్ణాటక అఖిల పక్ష బృందం గురువారంనాడు ప్రధాని మన్మోహన్ సింగ్కు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న 11 సాగునీటి ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ధరంసింగ్ విమర్శించారు.