వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ తోడల్లుడి ప్రాజెక్టుపై కర్ణాటకకు ఎపి విజ్ఞప్తి
హైదరాబాద్: రాజోలి బండ మళ్లింపు పథకం ( ఆర్డియస్)పై మినీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి గురువారం ఒక లేఖ రాసింది. కర్ణాటక ప్రభుత్వం కోసం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు తీసుకొని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంపై శాసనసభలోనూ వెలుపలా తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని వేసింది. నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు తాను ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేస్తానని రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు సుబ్బారెడ్డి ప్రకటించారు. మధ్యలో నిర్మాణం చేపట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
Comments
Story first published: Friday, May 6, 2005, 23:53 [IST]