వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని లేకుంటే రైతుకూలీలకు తక్షణమే పని: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/ అనంతపురం: రాయలసీమ ఐజి మీనా, అనంతపురం జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ) ప్రవీణ్‌కుమార్‌లను తొలగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. తెలుగుదేశం నాయకులు సోమవారం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నారాయణరావుకు ఫిర్యాదు చేశారు. మీనా, ప్రవీణ్‌కుమార్‌లు కాంగ్రెస్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసులు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపి ఆరుగురిని బలి తీసుకున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై గ్రామగ్రామాన అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన అన్నారు.

ఇదిలా వుంటే, కాంగ్రెస్‌ అభ్యర్థి బోయ శ్రీరాములు సోమవారంనాడు మంత్రులు రఘువీరారెడ్డి, జె.సి. దివాకర్‌ రెడ్డిల సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక నాయకులందరూ కలిసి ఓట్లడుగుతారని మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. పెనుకొండ ఓటర్లు ఫ్యాక్షన్‌ రాజకీయాలు వద్దంటున్నారని, శాంతిని నెలకొల్పడానికి తాము చేస్తున్న కృషిని ఆహ్వానిస్తున్నారని, తమ వెంట ఉంటామని చెబుతున్నారని ఆయన అన్నారు. శ్రీరాములు గెలుపునకు అందరూ సహకరిస్తున్నారని గంగుల భానుమతి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X