తెలంగాణపై నేతలకు బాబు హెచ్చరిక

తెలంగాణపై తమ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. కాంగ్రెస్ మాత్రమే తెలంగాణను ఇవ్వగలదని చెప్పాలని కూడా ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ దురుద్దేశ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆయన మంత్రులకు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా లేవని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. తెరాస కింది స్థాయి కార్యకర్తలను ఎదుర్కునే వ్యూహాన్ని అనుసరించాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశానికి 18 మంది మంత్రులు హాజరయ్యారు. ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు మంత్రులను ముఖ్యమంత్రి ఇంచార్జీలుగా నియమించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీకి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. రాజ్యసభ ఎన్నికలపై ఆయన సోనియాతో మాట్లాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
