అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు

వీరాభిమన్యు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతి రావు. ఆయన 1937 జనవరి 14వ తేదీన కృష్ణా జిల్లా చిననందిగామ గ్రామంలో జన్మించారు. మొదట ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన శోభన్ బాబు 1965 వచ్చిన వీరాభిమన్యుతో సోలో హీరోగా నిలదొక్కుకున్నారు. గోరింటాకు, మల్లెపువ్వు, శారద, బలిపీఠం, ముందడుగు, కార్తీక దీపం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు ఐదు సార్లు నంది అవార్డులు వచ్చాయి. నాలుగు సార్లు ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. తన సమకాలీన నటుడు కృష్ణతో కలిసి ఆయన మంచిమిత్రులు, కురుక్షేత్రం వంటి సినిమాల్లో నటించాడు. ఏ మాత్రం బేషిజాలు లేని నటుడిగా శోభన్ బాబుకు పేరుంది.












Click it and Unblock the Notifications