వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాస్తా మందగించిన బాబు యాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: మీ కోసం చైతన్య యాత్రలో వేగాన్ని తగ్గించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. రోజుకు 60 కిలోమీటర్ల యాత్ర చేపట్టాలని మొదట నిర్ణయించి చంద్రబాబు ఆ విధంగా పర్యటన జరుపుతూ వచ్చారు. అయితే కాస్తా నెమ్మదిగా రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణించేలా చూసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీని వల్ల ఎక్కువ మంది ప్రజలను కలుసుకుని వారి సమస్యలను మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని ఆయన భావిస్తున్నారు.

మొదట నిర్ణయించుకున్న ప్రకారం చంద్రబాబు యాత్ర ఈ నెల 30వ తేదీన గుంటూరు జిల్లాలో ముగిసి నల్లగొండ జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఆయన యాత్ర గుంటూరు జిల్లాలో మే 2వ తేదీన ముగుస్తుంది. మే 1వ తేదీన గుంటూరు జిల్లాలోని 1వ తేదీన పిడుగురాళ్లలో పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. అభ్యర్థుల జాబితాను చంద్రబాబు నల్లగొండ జిల్లాలో ప్రకటిస్తారు. ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా యాత్ర సందర్భంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబుకు సీనియర్ నాయకులు సూచిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X