పార్టీ ఆఫీసులో చిరు పతాకావిష్కరణ
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జూబిలీహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పతాకను ఆవిష్కరించారు. వికలాంగుల మధ్య ఆయన ఈ పతాకను ఆవిష్కరించారు. చిరంజీవి ఈ నెల 17వ తేదీన తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటిస్తారని ఆయన బావమరిది అల్లు అరవింద్ గురువారం సాయంత్రం ప్రకటించారు. చిరంజీవి పాటల క్యాసెట్ ను సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో అవిష్కరించి ఆయన ప్రసంగించారు. ఈ నెల 26వ తేదీన పార్టీని తిరుపతిలో జరిగే బహిరంగ సభలో లాంఛనంగా ప్రకటిస్తారని ఆయన చెప్పారు.
తిరుపతిలో అవిలాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సభకు 20 లక్షల మంది దాకా వస్తారని అల్లు అరవింద్ చెప్పారు. చిరంజీవి ఆంతరంగిక భద్రతను ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ చూస్తారు. యువ విభాగాన్ని కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తారు.












Click it and Unblock the Notifications