జాతీయ జెండాను ఎగరేసిన లోకేష్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ ఎన్టీఆర్ మోడల్ స్కూలులో శుక్రవారం జాతీయ పతాకను ఆవిష్కరించారు. గండిపేటలోని ఈ పాఠశాల ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. సాధారాణంగా ఏటా చంద్రబాబునాయుడు ఈ పాఠశాలలో జాతీయ పతాకను ఆవిష్కరిస్తారు. మీ కోసం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అనంతపురంలో ఉన్నారు. మీ కోసం యాత్ర సందర్భంగా శుక్రవారం అనంతపురంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో చంద్రబాబు పాల్గొంటారు.
దీంతో లోకేష్ రాజకీయాల్లోకి అడుగు పెడతారనే ప్రచారం మొదలైంది. లోకేష్ కు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో జాతీయ పతాక ఆవిష్కరణ బాధ్యతను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ సేవా కార్యక్రమాలకు సంబంధించింది కాబట్టి లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడు పుష్పరాజ్ పతాకావిష్కరణ చేశారు.












Click it and Unblock the Notifications