నిజామాబాద్: నిజామాబాద్ లో సినీ సందడి నెలకొంది. సినీ తారలు యువతను ఉర్రూతలూగించారు. రాష్ట్రపతి రోడ్డులోని గంగారాం షాపింగ్మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీతారలు ఇలియానా, హన్సికలు హాజరయ్యారు. ఈ విషయం ముందుగానే తెలియటంతో యువత పెద్దఎత్తున తరలివచ్చారు. జోరు వానలోనూ యువత సందడి తగ్గలేదు. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు అష్ట కష్టాలు పడ్డారు. కలెక్టర్ రామాంజనేయులు, ఎస్పీ సూర్యనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.