పేదల పొట్టలు కొడుతున్నారు: చిరు

Chiranjeevi
మహబూబ్ నగర్: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్ ల) పేరుతో పేదల కడుపులు కొట్టి పెద్దలకు పెడుతున్నారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. పోలేపల్లి సెజ్ బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన శుక్రవారం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. పచ్చని పొలాలను సెజ్ ల పేరుతో పెద్దలకు అప్పగిస్తున్నారని ఆయన అన్నారు. సెజ్ ల వ్యవహారంలో అంతర్గతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందని ఆయన అన్నారు. ప్రజలను తమ భూముల్లోనే తమను కూలీలుగా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అన్యాయాన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రజలకు తాము అండగా నిలుస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సెజ్ ల అవసరం ఉందని, అయితే పారిశ్రామికవేత్తలు తమంత తాము భూములను సేకరించుకోవాలని, ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని, కానీ ప్రభుత్వమే భూములను సేకరించి ఇవ్వడం సరైంది కాదని ఆయన అన్నారు. సెజ్ లకు నిరుపయోగమైన భూములు ఇవ్వాలి గానీ రైతుల పొట్టలు కొట్టి వారి భూములు తీసుకుని ఇవ్వకూడదని ఆయన అన్నారు.

ప్రశ్నించేవారు లేకపోవడంతో సెజ్ లకు వేలాది ఎకరాలు దారాదత్తం చేస్తున్నారని, 2003 నుంచి సెజ్ ల వ్యవహారం మొదలైతే ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన అన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన స్పష్టత లేకుండానే భూములు అప్పగిస్తున్నారని ఆయన విమర్శించారు. పేదలను తమ పొలాల్లోనే తమను కూలీలుగా మార్చడం అభివృద్ధి కాదని ఆయన అన్నారు. భూమి పెద్దలకు హోదా, పేదలకు తిండి పెట్టే తల్లి, సెంటిమెంటు అని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయలేని అమాయకుల నిస్సహాయత వల్లనే ఈ దారుణం జరుగుతోందని, దీన్ని ఆపాలని, ఇందుకు సంబంధించిన మార్పు తప్పకుండా వస్తుందని ఆయన అన్నారు. పెద్దల భూములు సెజ్ ల్లో ఒక్కరివి కూడా పోలేదని, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల భూములే పోతున్నాయని ఆయన అన్నారు. తీరప్రాంతాన్ని సెజ్ ల పేరిట పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం దారుణమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+