వైయస్ ప్రభుత్వంపై చిరు నిప్పులు

Chiranjeevi
అనంతపురం: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన తన రాయలసీమ పర్యటనను అనంతపురం జిల్లా గోరంట్ల నుంచి ఆదివారంనాడు ప్రారంభించారు. ఆయన కార్యక్రమానికి పెద్ద యెత్తున ప్రజలు కదిలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు ధనికులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని, ప్రాజెక్టులు, సెజ్ లు, కోస్తా కారిడార్ ధనికులకే లాభం చేసి పెడుతున్నాయని, ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ విధానాలన్నీ పైపై మెరుగులేనని, ప్రజాకర్షక పథకాలతో ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తున్నారు సరే కూరగాయల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లా అక్షర క్రమంలో మొదట ఉన్నా అభివృద్ధిలో వెనకబడి ఉందని, దీనికి ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన ఎన్. రఘువీరా రెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉన్నా ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన తప్పు పట్టారు. ఇంద్ర సినిమాలో రాయలసీమను స్పృశించిన అనుభూతి ఇంకా తనలో ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+