ఐరాస కమిటీలో ఆంధ్ర వైవిరెడ్డి

ఐరాస సభ్యదేశాల ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు అవసరమైన సలహాలను ఈ కమిటీ ఇస్తుంది. ఐరాస ప్రతినిధి ఎన్రిక్ ఈవ్స్ శుక్రవారం ఈ మేరకు వెల్లడించారు. ఈ ఉన్నతస్థాయి ఆర్థిక నిపుణుల కమిటీలో బార్బడోస్లో ఉంటున్న భారత సంతతికి చెందిన అవినాష్ ప్రసాద్ కూడా ఉన్నారు. ఈయన ఇంటెలిజెన్స్ క్యాపిటల్ లిమిటెడ్కు ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్ఎస్ఈ) సభ్యుడు కూడా. కమిటీలోని ఇతర సభ్యుల్లో జెటీ అక్తర్ అజీజ్(మలేషియా), చుకుమా సొలుడో (నైజీరియా), యూ యాంగ్డింగ్ (చైనా), జోస్ ఆంటోనియో ఒకాంపో (కొలంబియా), ఇసూకే సకాకీబరా (జపాన్), జీన్ పాల్ ఫిటోసీ (ఫ్రాన్స్), ఐరాస ప్రతినిధిగా జోమో క్వామే సుందరంలు ఉన్నారు.












Click it and Unblock the Notifications