పార్టీ అధిష్ఠానంపై మారెప్ప నిప్పులు

తాను తాగుతానని, వాగుతానని అన్న వామపక్షనేతలపై మంత్రి మారెప్ప తీవ్రంగా ధ్వజమెత్తారు. వాళ్లు తననెప్పుడైనా విందులకు ఆహ్వానించారా? తాను తాగటం చూశారా అన్నారు. తన దగ్గరకు పనులకు వచ్చిన వాళ్లు తననే విమర్శించేపాటి వాళ్లా అని జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకటరెడ్డిల సంగతి తనకు తెలియదా? లెటర్ప్యాడ్లు అమ్ముకుని బతికే రకాలు తనకు చెప్పొచ్చారా అని మారెప్ప మండిపడ్డారు. తనను అనటం కాదు దమ్ముంటే ఇష్టారాజ్యంగా మాట్లాడే మంత్రి జేసీని విమర్శించాలని వామపక్షాలను సవాలు చేశారు. రాయలసీమ పౌరుషాన్ని ప్రతిబింబిస్తూ మీసం మెలేసి తొడ గొట్టానని చిరంజీవి అంటున్నారని గుంటూరులో ముఠా మేస్త్రీడైలాగులు, చిలకలూరిపేటలో చిలుకా క్షేమమా అనే పాటలు పాడతారా అని విమర్శించారు.












Click it and Unblock the Notifications