వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ జిల్లాలో నక్సల్ హతం
వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున పోలీసులకు, నక్సలైట్ కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సలైట్ హతమయ్యాడు. వాహనాల తనిఖీ సందర్భంగా కొత్తగూడ మండలం గంగారం వద్ద ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ చెప్పారు. ఆ నక్సలైటును ప్రజాప్రతిఘటనకు చెందిన బానోతు బద్రీ అలియాస్ సంజీవ్ గా గుర్తించారు.
వాహనాల తనిఖీ సందర్భంగా కారులో వెళ్తూ అతను ఎదురయ్యాడని, కారు ఆపి కిందికి దిగి పోలీసుల పైకి కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులో జరిపారని, ఈ ఎదురుకాల్పుల్లో నక్సలైట్ మరణించాడని ఎస్పీ వివరించారు. సంఘటనా స్థలం నుంచి ఒక స్ప్రింగ్ పిల్ ను, ఆయుధాలను, అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లకు ఆయుధాలు సరఫరా చేస్తూ అతను ఎదురు పడినట్లు ఎస్పీ చెప్పారు.
Comments
Story first published: Wednesday, December 3, 2008, 9:04 [IST]