మెగా కూటమి ఏమీ చేయలేదు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: తెలంగాణ అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమేనని, ఎన్నికల్లోపు ఏదో ఒకటి చెప్పాలన్నది మంచిదేనని, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నామని, ఏకాభిప్రాయం కుదరకపోతే ఏం చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభ ఆవరణలో ఆయన తన సన్నిహితులతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఈ మాటలన్నారు. కాంగ్రెస్‌కు 175 సీట్లు వస్తాయని సర్వేల ఆధారంగా జరుగుతున్న ప్రచారం తప్పని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 230 సీట్లకు తగ్గవని స్పష్టం చేశారు. పార్టీ పరిస్థితి రోజురోజుకు పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో 51 శాతం పైగా ఓట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సీపీఎం, సీపీఐలకు ఉన్న ఒకటి రెండు శాతం ఓట్లు తమ విజయాన్ని ప్రభావితం చేయవన్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కలిసినా పెద్దగా ప్రభావం ఉండదని ఆయన అభిప్రాయ పడ్డారు. మెగా కూటమి, మహా కూటమి పేర్లతో ఎందరు కలసినా కాంగ్రెస్‌కు ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వంపై ధరల ప్రభావం కొంత ఉంటుందన్నారు. కాంగ్రెస్‌, బిజెపిల మధ్య ముఖాముఖి పోటీ ఉన్న చోట మాత్రమే ముంబై పేలుళ్ల ప్రభావం ఉంటుందని రాజశేఖర రెడ్డి అన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+