వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ భవన్ కోసం గరీబులకు షాక్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కార్యాలయ భవన నిర్మాణంకోసం గాంధీభవన్‌ సమీపంలోని భీమ్‌రావ్‌వాడను ఈరోజు పోలీసులు ఖాళీ చేయించారు. సంవత్సరకాలంగా వారిని ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దివంగత ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ వారిని అక్కడినుంచి ఖాళీ చేయించకుండా అడ్డుకున్నారు.

దీనిపై స్థానికులు కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు స్టే ఇవ్వటంతో తరలింపు ప్రక్రియ ఆగిపోయింది. ఈరోజు తెల్లవారుజామున జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు వచ్చి ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ విషయం తెలిసి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి, టీడీపీ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బ బండారు దత్తాత్రేయ అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారినీ అరెస్టుచేశారు.

ఈ ఉదంతంపై మంత్రి ముఖేష్‌ మాట్లాడుతూ కోర్టు స్టే ఎత్తివేసినందునే తాము ఖాళీ చేయిస్తున్నామని, వారికి ఇంతకంటే మంచి ఇళ్లను అఫ్జల్‌సాగర్‌లో ఇచ్చామని ఇంకా ఏ సౌకర్యాలు కావాలన్నా కల్పిస్తామని తెలిపారు. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలో ట్రాఫిక్‌ భారీగా స్థంభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X