వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్తు ఏదైనా..గెలుపే:చిరు ధీమా

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ :వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయించమని కోరుతూ సోమవారం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి వేణుగోపాల స్వామిని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.అనంతరం తనను కలిసిన మీడియాతో ఎన్నికల గుర్తు ఏదైనా ఫవరాలేదని, ప్రజలే ప్రజారాజ్యం పార్టీని ఆదరిస్తారని చిరంజీవి దీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, తాము ఉదయించే సూర్యుని గుర్తు కేటాయించమని ఎన్నికల సంఘాన్ని పట్టుబట్టడం అవాస్తవమన్నారు. ఈసి ఏ గుర్తు ఇచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు. బిజెపితో పొత్తు ఉండబోదని సంకేతమిచ్చిన చిరంజీవి టిఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకోవడానికి లోపాయకారీ చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.పార్టీ గుర్తు కేటాయింపుకోసం ప్రజా రాజ్యం పార్టీ చేసిన దరఖాస్తుపై ఈరోజు పరిశీలన ఉండటంతో వివరణకోసం చిరంజీవి డిల్లీ వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X