త్యాగానికి సిద్ధం: నన్నపనేని రాజకుమారి
విజయనగరం: త్యాగాలకు సిద్ధంగా ఉండాలంటూ తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ సీనియర్నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. బాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయనతోపాటు వచ్చిన రాజకుమారి విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.
తాను పదవులు ఆశించి పార్టీలోకి రాలేదని, పార్టీ సూచించినట్లు ఆ త్యాగాలేవో తనతోనే మొదలుపెడతానని ఆమె అన్నారు. తనలో సత్తా ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని చెబుతూ, ఏళ్ల తరబడి వేచి చూశాకే పీవీకి ప్రధాని పదవి దక్కిందన్నారు. అన్ని అర్హతలూ ఉన్నా సోనియాకే ప్రధాని పదవి రాలేదని అన్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా చంద్రగిరి టికెట్ సంపాదించుకున్న నేపధ్యంలో నన్నపనేని కొంత ఢీలా పడినా పైకి గంభీరంగా కన్పించారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications