కరుణానిధి ఆస్పత్రికి తరలింపు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సోమవారం నడుమునొప్పితో ఆసు పత్రిలో చేరారు. నడుమునొప్పి కారణంగా ఈ తెల్లవారుజామున లేవలేని పరిస్థితి తలెత్తడంతో కరుణానిధిని రామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు వెల్ల డించాయి. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగైనట్లు వారు చెప్పారు.
వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో కొన్ని సంవత్సరాలుగా కరుణానిధి పలుమార్లు ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే డిఎంకెలో నాయకత్వ లేమి కారణంగా కరుణ విశ్రాంతి తీసుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా వైద్యులు వారం రోజుల పాటు బెడ్రెస్ట్ తప్పదని హెచ్చరించారు.
Comments
Story first published: Wednesday, January 28, 2009, 14:18 [IST]