జీవిత ఖైదీని చేశారు: చిరు

Chiranjeevi
గుంటూరు: ప్రజలను తనను జీవిత ఖైదీని చేశారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. బుధవారంనాడు ఆయన పర్యటన గుంటూరు జిల్లాలో కొనసాగింది. తాను సినిమాలే జీవితమనుకున్నానని, ఆ తర్వాత కుటుంబానికే పరిమితం కావాలనుకున్నానని, కానీ ప్రజలు అందుకు అంగీకరించలేదని, తమ జీవితాల్లోకి రావాలని తనను ఆహ్వానించారని ఆయన అన్నారు. ఇప్పుడు తాను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కుటుంబంలో సభ్యుడ్ని అయ్యాయని ఆయన చెప్పుకున్నారు. ప్రజలు తనను రుణగ్రస్థుడిని చేశారని, ఆ రుణం తీర్చుకోవడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.

తనతో 30 ఏళ్ల జీవితంతో ప్రజలు పెనవేసుకుపోయారని, తెరపై తనను చూసి గుండెల్లో ఖైదీని చేశారని ఆయన అన్నారు. ప్రజలతో తనది ఎన్ని జన్మల అనుబంధమో అని ఆయన అన్నారు. శాసనసభలో బుధవారం చోటు చేసుకున్న సంఘటనలపై చిరంజీవి తీవ్రంగా ప్రతిస్పందించారు. సభ్యులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నువ్వు ఇంత తిన్నావంటే, నువ్వు ఇంత తిన్నావని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని, వాటికి ప్రజా సమస్యలు పట్టి లేవని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+