హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దౌర్జన్యం చేయలేదు: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాల సభ్యులు కావాలనే నాటకం ఆడుతున్నారని శాసన సభా వ్యవహారాల మంత్రి రోశయ్య అరోపించారు. విధిలేకే వారిని అసెంబ్లీనుంచి సస్పెండ్‌ చేశామని ఆయన చెప్పారు. సస్పెండ్ చేసిన వెంటనే బయటకు వెళ్లాల్సినవారు కావాలనే బలవంతంగా బయటకు పంపేట్లు ప్రవర్తించారని ఆయన అన్నారు.

బయటకు తీసుకెళుతుండగా మార్షల్స్‌పై తిరగబడి వారు దౌర్జన్యం చేయటంతో వారు గట్టిగా వ్యవహరించారు తప్ప వారిని గాయపరచలేదని ఆయన అన్నారు. దెబ్బలు తగిలాయని వారు నాటకాలు ఆడుతున్నారని, ఇదంతా కావాలని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శాసనసభ్యులకు వేరే విధంగా దెబ్బలు తగిలి ఉంటాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X