ఎమ్మెల్యేల గెంటివేత: ఉద్రిక్తత
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల మీద మార్షల్స్ దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గాయపడడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. వాయిదా తీర్మానాలపై చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకరు ఇందుకు అనుమతించకపోవడంతో వారు పోడియం వద్దకు దూసుకెళ్ళారు. సభ నిర్వహణకు అంతరాయం కావడంతో స్పీకరు వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్ళకపోవడంతో మార్షల్స్ ద్వారా వారిని బయటికి పంపించారు. ఆ క్రమంలో పయ్యావుల కేశవ్ గాయపడ్డారు.
అంతకు ముందు శాసనసభ రెండుసార్లు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. స్పీకర్ ప్రసంగంపై చర్చ, బడ్జెట్పై చర్చ సందర్భంగా విపక్షాలకు బోలెడు సమయం దొరుకుతుందని అనుకున్నది మాట్లాడవచ్చని 9.30 అనంతరం సమయమంతా విపక్షాలదేనని స్పీకర్ అన్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినకపోవటంతో సభను రెండవసారి 15 నిముషాలపాటు వాయిదావేశారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications