అతని ఆస్తులు పది కోట్లపైనే
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఉప్పల్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ దశరథ్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పది కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు బయటపడ్డాయి. అతనికి పెద్ద యెత్తున ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఫ్లాట్లు ఉన్నట్లు ఎసిబి సోదాల్లో వెల్లడైంది. అతని స్వస్థలం సిద్ధిపేటలోనూ, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.
ఎసిబి అధికారులను చూసిన దశరథ్ కిటికీ నుంచి నగదును, ప్రామిసరీ నోట్లను ఇంటి కిటికీ నుంచి బయటకు విసిరేశాడు. వాటిని కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, సరూర్ నగర్, మామిడిపల్లి తదితర ప్రాంతాల్లో అతనికి 31 ఎకరాల భూములున్నట్లు కనుక్కున్నారు. దాదాపు 47 లక్షల రూపాయల విలువ చేసే ప్రామిసరీ నోట్లను కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంత నగదు కూడా ఎసిబి అధికారులకు చిక్కింది. మూడు బ్యాంకు లాకర్లున్నాయి. వాటిని తెరవాల్సి ఉంది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications